పనాజీ: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులను కొద్దిరోజుల కిందట జామియానగర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసిన కేసులో… అరెస్టు చేసినవారు అమాయకులని విచారణలో తేలితే తాము యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్సింగ్ చెప్పారు. ఈ కేసులో అరెస్టయిన వారికి తమ పార్టీ న్యాయసహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. నిజంగా వారు తీవ్రవాదులైతే చంపేయాలనీ, అమాయకులైతే మాత్రం వారికి న్యాయ సహాయం అందించాలని అమర్సింగ్ అన్నారు. ఈ కేసును వాదించేందుకు సీనియర్ న్యాయవాది రామ్జెఠ్మలానీ అంగీకరించారు.
అక్టోబర్ 7, 2008
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI