హైదరాబాద్: ఎన్నికల పొత్తులపై ఈ నెల 12 నుంచీ ప్రారంభం కానున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రకాశ్ కారత్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్, భాజపాల ఓటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కమిటీ అభిప్రాయాన్ని తెలుసుకున్నామనీ, వాటిని కేంద్ర కమిటీకి నివేదిస్తామని కారత్ తెలిపారు. పొత్తుల విషయంలో సీపీఐదీ, తమదీ ఒకే అభిప్రాయమని కారత్ అన్నారు.
అక్టోబర్ 7, 2008
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI