హైదరాబాద్: మగధీర చిత్ర ప్రదర్శన సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందిన సంఘటనలపై 15 రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సరైన వైరింగ్ కాని, ఫైర్సేఫ్టీకాని లేక సినిమాహాళ్లు మృత్యు కుహరాలుగా, ప్రమాదనిలయాలుగా మారాయని, ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యతను కోర్టు తీసుకోవాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. నూటికి 90 శాతం థియేటర్లలో అగ్నిప్రమాదాల జాగ్రత్తలు పాటించటం లేదని, 780 థియేటర్లలో పొగ బయటకు వెళ్లే వీలు లేదని, 250 సినిమాహాళ్లలో ఫైరింజన్లు ఆపేందుకు స్థలం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు విచారణను 26వ తేదీకి వాయిదావేసింది.
ఆగష్టు 12, 2009
వ్యాఖ్యానించండి »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI